మన్యం మనుగడ పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం చింతల బయ్యారం గ్రామము నలుగు వైపులా గోదావరి వరద నీరు చేరడంతో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆ ప్రదేశానికి వెళ్లి, గ్రామంలోని ప్రజలందరినీ ట్రాక్టర్ల ద్వారా పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. పునరావాస కేంద్రంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముంపు ప్రాంతాల ప్రజలు అందరూ పునరావాస కేంద్రానికి తరలిరావాలని, కోరారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, వ్యవసాయ విస్తరణ అధికారి లక్ష్మణరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: