దమ్మపేట జూలై 09 ( మన్యం మనుగడ ) :పోడు భూముల పట్టాల సాధనకై డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇళ్ల స్థలాలు పెన్షన్లు రేషన్ కార్డులు కై చలో భద్రాచలం విజయవంతం చేయాలని కార్యవర్గ సమావేశంలో కోరినారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నదని పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదని దళితులకు పేదలకు. మూడు ఎకరాలు భూమి ఊసే లేదని,డబల్ బెడ్రూమ్ ఇల్లు జాడలేదని,డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ ఊసేలేదని తెలిపారు.నియోజవర్గానికి మల్టీపర్పస్ ఆసుపత్రి ఊసేలేదని,ధరణి తప్పుల తడకైందని భూమి మాయమైందని,భూ రికార్డులు తారుమారయ్యాయని,పేదవాళ్ళ భూముల కు పాసు బుక్కులు కాలేదని,వాళ్ళకి రైతుబంధు రావట్లేదని తక్షణం ధరణి రద్దు చేయాలని అన్ని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యలు పరిష్కారానికై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 11వ తారీఖు నాడు భద్రాచలం ఐ టి డి ఏ కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను నాయకులను సీపీఐ పార్టీ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కర రావు కోరినారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పండూరి వీరబాబు,సహాయ కార్యదర్శి సుంకుపాక ధర్మ .ఏఐటీయూసీ కార్యదర్శి బెజవాడ రాము.ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి బత్తుల సాయి.మహిళా సమాఖ్య కార్యదర్శి జానీ బేగం,శాంతి,దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షురాలు నక్క నాగమణి,నల్ల ప్రసాద్,గాజు బోయిన కృష్ణవేణి,కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: