మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని, సమితి సింగారం,శాంతి నగర్, పగిడేరు పంచాయతీల లోని పలు ప్రాంతాలలో జడ్పీటిసి పొశం.నర్సింహారావు, తహశీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ వీరబాబు,ఎంపిఓ వెంకటేశ్వర్లు,విస్తృతంగా పర్యటించారు.గత రెండు మూడు రోజులకు కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో మండలం లోని లోతట్టు ప్రాంతాలను,చెరువులను,గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,సహాయ చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వలన ఎలాంటి సమస్య వచ్చిన అండగా ఉంటామని ప్రజలకు భరోసా ఇచ్చారు.లోతట్టు ప్రాంతాలలో,నీరు నిలువ ఉన్నచోట తీసుకోవాలసిన చర్యలపై పంచాయతీ సెక్రెటరీ లకు సలహాలు,సూచనలు చేశారు.పారిశుద్ధ్య నిర్వహణ తప్పనిసరిగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, పంచాయితీ సెక్రెటరీ లు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ముత్యంబాబు,నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: