దమ్మపేట జులై 13 ( మన్యం మనుగడ ) :మందలపల్లి శ్రీ షిర్డీ సాయి మందిరం లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందలపల్లి గ్రామానికి చెందిన ప్రముఖులు అడపా వేణుగోపాల్, సంధ్య దంపతులు సాయిబాబా కు సుమారు 15 కేజీల వెండితో సింహాసనం మరియు మకరతోరణం తయారు చేయించి బాబాను అలంకరించారు.అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో వేణుగోపాల్ సోదరి తులసి, సాయిబాబా దంపతులు, ఉపసర్పంచ్ గారపాటి సూర్యనారాయణ, అనురాధ దంపతులు తులసి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: