మన్యం మనుగడ కరకగూడెం: గత నాలుగు రోజులుగా మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిధిలోని వాగులు ,వంకలు పొంగి పొర్లుతున్నాయి.చెరువులు నిండి అలగులు పోస్తున్నాయి.దీంతో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఈ క్రమంలో పలు శాఖల అధికారులు ముప్పు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.కరకగూడెం మండల కేంద్రానికి చెందిన బూరుగడ్డ శంకరయ్య పూరిల్లు గోడలు భారీ వర్షానికి కులే స్థితికి చేరడంతో కరకగూడెం తహసీల్దార్ ఉషా శారద ఆ ఇంట్లో వారిని ఖాళీ చేయించి కరకగూడెం జెడ్పి పాఠశాలలో పునరావాసం కల్పించారు.అంతేకాకుండా వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజాలేవరు అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఆర్ఐ షేక్ హుస్సేన్,ఎంపీఓ చిరంజీవి,విఆర్వోలు,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: