మన్యం మనుగడ కరకగూడెం: కరకగూడెం మండల పరిధిలోని చిరుమళ్ళ( కరకగూడెం) గిరిజన ఆశ్రమ పాఠశాలను కరకగూడెం తాసిల్దార్ ఉషా శారద అకస్మిక తనిఖీ చెశారు.ఆశ్రమ పాఠశాలలోని తరగతి గదులను వంటశాలను పరిసరాలను పరిశీలించి మధ్యాహ్నం భోజన సమయంలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు.అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆమె అన్నారు.విద్యార్థులకు పౌష్టికాలతో కూడిన రుచికరమైన ఆహారం వడ్డించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థుల అభివృద్ధికి అందరూ తోడ్పాటు అందించాలని ఆమె అన్నారు. పిల్లలకు మినరల్ వాటర్ అందించాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ క్లోరినేషన్ తో పాటు బాత్ రూమ్ లను శుభ్రం చేయించాలని ప్రధానోపాధ్యాయుడు జగన్ సూచించారు. అనంతరం మధ్యాహ్నం పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జగన్, వార్డెన్ సంపత్, ఆర్ఐ హుస్సేన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: