మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కేంద్రంగా ఏర్పడిన తర్వాత సత్తుపల్లిలో ఉన్నటువంటి ఆర్టిఏ కార్యాలయం సబ్ రిజిస్టర్ కార్యాలయం తదితర ముఖ్యమైన కార్యాలయాలను జిల్లా కేంద్రంలోకి తరలిస్తున్నారు కానీ అశ్వరావుపేట మండలం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు కొత్తగూడెం పోవాలంటే సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుందనీ అశ్వరావుపేట మండల కేంద్రం నుండి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి సరియైన బస్సు సర్వీసులు లేవు కావున ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గమనించి ప్రజలకు దగ్గరలో ఉండే విధంగా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో లో ఆర్టీవో కార్యాలయం సబ్ రిజిస్టర్ ఆఫీస్ కోర్టు మినీ బస్ డిపోను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అశ్వరావుపేట మండల సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అశ్వరావుపేట సిపిఐ ఆఫీస్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ధర్నా నిర్వహించారు. అనంతరం తాహసిల్దార్ కి మెమోరండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గన్నిన రామకృష్ణ ఏఐటీయూసీ జిల్లా నాయకులు టి సత్యనారాయణ, మండల సహాయ కార్యదర్శులు సయ్యద్ రఫీ, సంఘం కృష్ణమూర్తి మరియు టి సంజయ్ షేక్ దిల్, టి వరలక్ష్మి, చీపుర్ల సత్యవతి, సజ్జ శ్రీను తదితర గ్రామ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: