మన్యం మనుగడ, మంగపేట.
బి ఎస్ పి పార్టీ ములుగు జిల్లా ఇంఛార్జెస్ శనిగరపు నరేష్ , మైస సతీష్ లు, ములుగు జిల్లా అధ్యక్షులు బొట్ల కార్తిక్, పెద్దలు , పార్టీ ఆశయాలను, మహనీయుల సిద్ధాంత ఆచరణను గొప్ప జీవిత బాధ్యతగా స్వీకరించి.. మహనీయులు కోరుకున్న బహుజన రాజ్యాధికారం దిశగా పయనించే విధంగా ఎల్లప్పుడు పనితీరు ఉండాలని జై భీమ్ రామ్మోహన్ కి బీఎస్పీ ములుగు జిల్లా పెద్దలు తెలియజేశారు.
తదనంతరం జై భీమ్ రామ్మోహన్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ కర్తవ్యం అప్పగించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెపుతూ..మహనీయుల ఆశయాల కోసం ప్రతిక్షణం పనిచేస్తానని, కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తానని ఈ సందర్బంగా తెలియజేశారు.బీఎస్పీ పార్టీ ని జిల్లా వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల, జనుల హృదయాలకు చేర్చే విధంగా పనిచేస్తానని, నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పగించిన అందరి నమ్మకాలూ వమ్ము చేయనని తెలియజేశారు.
Post A Comment: