మన్యం టివి మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలో శుక్రవారం నాడు కురిసిన భారీ వర్షం కారణంగా ముత్యాలమ్మ నగర్ కు చెందిన బట్ట రాములు ఇంట్లోకి వరద చేరటం జరిగింది.విషయం తెలిసిన వెంటనే ఈ సమస్యపై తక్షణమే స్పందించిన స్థానిక సర్పంచ్ జంపేశ్వరి ఆధ్వర్యంలో లో బట్ట రాములు కుటుంబానికి నిత్యవసర వస్తువులను శనివారం నాడు జడ్పిటిసి పోశం.నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, వార్డు మెంబర్ శ్రీను,టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్, నాయకులు మేకల రవి,రాజు స్ధానిక పనాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: