ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి : లవింగ్ హార్ట్స్ మినిస్ట్రీస్ రాజాపురం జరిగిన కార్యక్రమానికి
ముఖ్యఅతిధిగా ములకలపల్లి ఎస్సై బి సురేష్ పాల్గొని వారి చేతుల మీదుగా పాస్టర్స్ కి 30 రైన్ కోట్స్, ఒంటరి మహిళలకు, నిరుపేద మహిళలలకు 10 కుట్టు మిషన్ లు వారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా 75 కుట్టు మిషన్ లు అందించడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ, ఈ గిరిజన ప్రాంతంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లవింగ్ హార్ట్స్ మినిస్ట్రీ నిర్వాహకులను అభినందిస్తూ, ముక్యంగా నన్ను ఈ సేవా కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తపరుస్తూ ధన్యవాదాలు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో సీతాయిగూడెం సర్పంచ్ కారం సుధీర్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలను ఇంకా మరెన్నో నిర్వహించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో లవింగ్ హార్ట్స్ సోషల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు UEC ఇండియా డైరెక్టర్ బ్రదర్ డేవిడ్సన్,సీతాయిగూడెం సర్పంచ్ కారం సుధీర్ ఎల్ ఎచ్ ఎం పాస్టర్స్ మరియు ఎల్ ఎచ్ ఎం
టీం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: