జూలూరుపాడు జులై 27, (మన్యం మనుగడ) ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏ లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ గత రెండు రోజులుగా జూలూరుపాడు మండల కేంద్రంలో వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరవధిక సమ్మెకు కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు బుధవారం సమ్మెలో పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీఆర్ఏల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని కోరారు. 55 సంవత్సరాలు పైబడిన వారందరికీ వారసత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్, నున్న కృష్ణయ్య, వాంకుడోత్ కిషన్ నాయక్, గూగుల్ రాంబాబు బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు, కంచ పోగు నరసింహారావు, దేవరకొండ నిర్మల, కొంగల లలిత, మంద కృష్ణ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి ఎదులాపురం గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: