గుండాల/ఆళ్లపల్లి7(మన్యం మనుగడ) ఆళ్లపల్లి మండల కేంద్రం లో భగత్ సింగ్ స్తూపం వద్ద నుండి మజీద్ వరకు 65 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, గతంలో వర్షం వచ్చిందంటే చాలు ఈ రహదారి గుండా ప్రయాణించాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు. మొత్తం బురద మయంగా ఉండడం వలన ప్రజలకు నరకయాతన కనిపించేది. స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే రేగా దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి బాహుబలి సీసీ రోడ్డును ఆయన 65 లక్షల రూపాయలతో పూర్తి చేయించారు మండలంలోని ఇంత పెద్ద సిసి రోడ్డు నిర్మాణం జరుపుకోవడం విశేషమే. చిరకాల స్వప్నం నెరవేర్చిన రేగాకు ప్రత్యేక ధన్యవాదాలు అని ప్రజలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి, స్థానిక సర్పంచ్ కోటేశ్వరరావు, వైస్ ఎంపీపీ ఎల్లయ్య, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: