గుండాల జూలై 7(మన్యం మనుగడ) హరితహారం కార్యక్రమం తో భావితరాలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు అన్నారు. గురువారం గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.అడవులను పరిరక్షించడం అడవులను పెంపొందించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని నెలకొల్పిన వారం అవుతామని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పచ్చదనాన్ని పెద్ద ఎత్తున, పెంపొందించుకోగలిగామని ఆయన అన్నారు.
Post A Comment: