CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గిరి వికాస్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలిఐదు ఎకరాల ఉన్న ప్రతి రైతు ఈ పథకానికి అర్హులే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Share it:


గుండాల/ఆళ్లపల్లి జూలై 7(మన్యం మనుగడ) గిరి వికాస్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రైతులకు సూచించారు. గురువారం మర్కోడు గ్రామంలో గిరి వికాస్ పథకం ద్వారా మంజూరైన బోర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరి వికాస్ ఎంతో గొప్ప పథకమని 5 ఎకరాల పైచిలుకు ఉన్న ప్రతి రైతు ఈ పథకానికి అర్హులే అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని అన్నారు. గిరి వికాస్ పథకం ద్వారా బోర్ వేసుకున్న లబ్ధిదారులకు 50 శాతం డబ్బులు కడితే మిగతా 50 శాతం ట్రస్ట్ ద్వారా మోటార్ ను కూడా మంజూరు చేయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని అర్హత ఉన్న రైతులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి, సర్పంచ్ శంకర్ బాబు, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: