మన్యం మనుగడ, మంగపేట.
కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ ఇసుక క్వారీలు నిర్వహిస్తున్న వారు వే బ్రిడ్జి నిర్వహిస్తూ క్వారీల చుట్టూ సీసీ కెమెరాలు తప్పకుండా పెట్టించి, చుట్టూ ఫెన్సింగ్ చేయాలన్నారు. ఓవర్ లోడుతో వెళ్లే లారీలను పసిగట్టి ఫైన్ వేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని అన్నారు. రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు చేపట్టరాదని ఏ గ్రామంలోనైనా సొసైటీలు రిజిస్టర్ చేసినచో ఆ గ్రామంలో గ్రామసభ నిర్వహిం చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏపీఓ అంకిత్, డిఆర్ఓ రమాదేవి, జిల్లా మైనింగ్ అధికారి రామాచారి, మరియు అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: