మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను మణుగూరు మండల యాదవ్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విప్ రేగా ను శాలువాతో ఘనంగా సత్కరించి,పుష్పగుచ్చం అందజేశారు.అనంతరం యాదవ్ లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి విప్ రేగా కాంతారావు కు వివరించడం జరిగింది.విప్ రేగా సమస్యల పై సానుకూలంగా స్పందిస్తూ, త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వారికి ఆయన హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహారావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,యాదవ్ సంఘం మండల అధ్యక్షులు మారుతి శ్రీనివాసరావు,నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్,గోకుల కృష్ణ సేవా సమితి అధ్యక్షులు మేకల ఆది లింగయ్య,యాదవ్ సంఘం ఉపాధ్యక్షులు సురేష్, సంఘం కోశాధికారి మేకల గోపి, ట్రెజర్ మంగి మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: