CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసి చట్టాల అమలు కొరకు 8 న భద్రాచలంలో జరిగే పాలకమండలి సమావేశానికి ఆదివాసీ ప్రజానీకం తరలి రావాలి..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::


మండలంలోని నడికుడి పంచాయితీ పరిధిలో ఏవీఎస్పి మండల కార్యదర్శి కోరం మురళి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదివాసి చట్టాల అమలు కొరకు ఏజెన్సీ చట్టాలను నిర్వీర్యం చేస్తున్న అధికారులను స్థానిక మండల అధికారులను ప్రజాప్రతినిధులను ప్రశ్నించే గొంతుకు గా ఆదివాసి ప్రజానీకం 8వ తేదీన భద్రాచలంలో జిల్లా స్థాయి పాలకమండలి సమావేశానికి ఆదివాసి ప్రజానీకం ఆదివాసి మేధావులు భారీగా తరలి రావాలని ఏఎస్పి, ఏవీఎస్పీ తరఫున పిలుపునిచ్చారు. ఏఎస్పి రాష్ట్ర అధ్యక్షులు పూణెం శ్రీనివాస్ ఆదేశాల మేరకు భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు మలుదొర ఈ కార్యక్రమానికి పాల్గొని ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ వాసుల హక్కులను తుంగలో తొక్కుతు అధికారులు ప్రజా ప్రతినిధులు ఆదివాసులపై ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు గమనించాలని సూచన ఇచ్చారు ఏజెన్సీ ప్రాంతంలో 29 శాఖల్లో ఉద్యోగాలను ఆదివాసులతోటి భర్తీ చేయకుండా పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు అక్రమ బహుళ అంతస్తుల పై కట్టడాలపై ఎల్ టి ఆర్ కేసులు నమోదు చేయకుండా అక్రమదారులకి వస్తాది పలుకుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర్ల అదినంలో ఉన్న భూములు ప్రభుత్వ భూములు ఆదివాసులకి పంచి అక్రమంగా గిరిజనేతరులు కు చేసిన పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీటన్నిటికీ అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం ఆదివాసులు ప్రశ్నించే రోజు వచ్చింది కాబట్టి ఆదివాసి మహిళలు విద్యార్థులు మేధావులు 8న ఆదివాసులు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జగడి ముద్ద రాజు, పూనెం సురేష్, తాటి వెంకటేశ్వర్లు, జనార్ధన్, మడకం నాగేశ్వరరావు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: