మన్యంమనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా కాంగ్రెస్ నాయకులు పట్టణంలో గల వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు చేసినా సేవలు గురుంచి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గం యువ నాయకురాలు వగ్గెలా పూజ, ఎంపీటీసీ వేముల భారతి, ఎంపీటీసీ సత్యవరపు తిరుమల, ఓబీసీ జిల్లా అధ్యక్షులు తుమ్మ రాంబాబు, ఎస్సీ సెల్ జిల్లా వైస్ అధ్యక్షులు బూసి పాండు, ఎస్సీ సెల్ అధ్యక్షులు తగరం రాజేష్, చెన్నం శెట్టి రామకృష్ణ, జల్లిపల్లి దేవరాజు, వేముల ప్రతాప్, సర్వేశ్వరరావు, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: