మన్యం మనుగడ, అశ్వారావుపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా పోలవరం విలీనం మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించనున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, గుంటూరు జిల్లా, తాడేపల్లి లోని తన నివాసం నుండి భారీ కాన్వాయ్ తో రహదారి మార్గంలో అశ్వారావుపేట పట్టణంలో ఆగారు. ఈ సందర్బంగా అశ్వారావుపేట పట్టణంలోని రింగ్ రోడ్ సెంటర్లో కార్యకర్తలకు అభివాదం చేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్లోని వేలేరుపాడు కుక్కునూరు మండలాలకు వెళ్లారు. గోదావరి ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని వరద ప్రాంతాల్లో పర్యటించి వరద భాదితులను పరామర్శించి, వరద బాధితులకు తానున్నానంటూ భరోసా ఇచ్చారు. అశ్వారావుపేట పట్టణంలో మాజీ సిఎం చంద్రబాబు నాయుడును చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు అశ్వారావుపేట రావడం జరిగింది.
Navigation
Post A Comment: