CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను ఘనంగా సన్మానించిన మణుగూరు షోరూం నిర్వాహకులు

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గురువారం నాడు మణుగూరు షోరూం నిర్వాహకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,విప్ రేగా కాంతారావు కృషితో మణుగూరు పట్టణానికి రవాణా శాఖ యూనిట్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,విప్ రేగా కాంతారావు ను మణుగూరు షోరూం నిర్వాహకుల ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఘనంగా సత్కరించి,పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు మణుగూరుకు రవాణా శాఖ యూనిట్ మంజూరు ఆఫీస్ మంజూరు కావడం ఆనందంగా ఉందన్నారు.ముఖ్యంగా పినపాక,మణుగూరు,కరకగూడెం,అశ్వాపురం మండలాలకు చెందిన వాహనదారులు ఇబ్బందులు అన్ని తొలగిపోతున్నాయన్నారు.ఈ ప్రాంత ప్రజలకు ఎంత సౌకర్యార్థ్వంగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు,మైత్రి మోటార్స్ సానికొమ్ము వెంకట్ రెడ్డి మైత్రి,శ్రీ భార్గవ్ ఆటోమొబైల్స్ యజమాని ఎన్.విజయ భాస్కర్ రెడ్డి,సాయి తేజ ఆటోమొబైల్స్ కే నరసింహారావు,శ్రీ లక్ష్మీ వినయ్ మోటార్స్ నాసిరెడ్డి భార్గవ్ రెడ్డి, నవీన్ డ్రైవింగ్ స్కూల్ వై నవీన్,శ్రీ సాయి ఆటో కన్సల్టెన్సీ కొండయ్య,బుల్లెట్ మెకానిక్ శ్రీను,బజాజ్ ఆటో షోరూం ఆలేటి అశోక్ రెడ్డి,విజయలక్ష్మి ఆటో కన్సల్టెన్సీ పి.కుమార్, ప్రభు ఆటో కన్సల్టెన్సీ పి వెంకట్ కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: