మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరునాగారం మండల కేంద్రంలో గత వారం రోజులుగా వరదలకు నష్టపోయిన కుటుం బాలకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) ద్వారా,
గురువారం ములుగు ఎమ్మేల్యే సీతక్క ఆధ్వర్యంలో వారి సమక్షంలో 500 వందల కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.ఎంతో మంది పేదలకు వేల కుటుంబాలకు సహాయం చేస్తూ ఈ రోజు మా ప్రాంత ప్రజలు సమస్యలో ఉన్నారని తెలిజేయగనే ఎంతో దూరం నుంచి అనంతపురం నుండి ఇక్కడికి వచ్చి 500 కుటుంబాలకు భారీ మొత్తంలో సహాయం చేసిన ట్రస్ట్ వారికి సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.
అదే విధంగా నిత్యం సహాయం చేస్తున్న ఆర్డిటి సంస్థ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అదే విదంగా లయన్స్ క్లబ్ వరంగల్ వారు కూడా సహాయం కోసం సంప్రదించడం తో వారు 60 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కూరగాయలు సమకూర్చడం జరిగింది వారికి కూడా మా ప్రజలకు ఆపదలో ఉన్న ప్రజలను ఆడుకోవడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న, జిల్లా మైనారిీటీ అద్యక్షులు అయుబ్ ఖాన్,మండల అధ్యక్షులు చిటమట రఘు,జిల్లా నాయకులు ఎండి ఖలీల్ ఖాన్,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య ,మాజీ ఎంపిటిసి వావిలాల నర్సింగరావు,
ముక్కెర లాలయ్య,యూత్ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్,టౌన్ అద్యక్షులు సులేమాన్,మండల ఉపాధ్యక్షులు రియాజ్,జిల్లా యూత్ మీడియా ఇంచార్జ్ గద్దల నవీన్,మండల యూత్ అద్యక్షులు వసంత శ్రీనివాస్,టౌన్ యూత్ అద్యక్షులు,లక్కీ,సరుకొప్పుల శ్రీను,కట్కూరి రాధిక, ముస్తాఫ్,నగవత్ కిరణ్, కాయ్యుం,దావూద్,రెహమాన్, సంపత్, కొండగిర్ల పోషలు, డొంగిరి మధు,దుర్గం అర్జున్,సోదరి హరీశ్, శంకర్,సునారికని శ్రీను,
రాంబాబు,రతన్, ప్రభాకర్,
సంపత్,విక్రమ్,రమేష్,శ్రావణ్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: