మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలంలో వినాయకపురం, తిరుమలకుంట, మావిళ్ళవారిగుడెం, ఊట్లపల్లి, రెడ్డిగూడెం గ్రామపంచాయతీలలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కూమార్తె స్వప్ని రెడ్డి వివాహం సందర్భంగా వచ్చే నెల 17-08-2022న జరిగే రిసెప్షన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ఆహ్వాన పత్రిక మరియు గడియారాలు ఇవ్వడానికి పంపించిన పెళ్లి శుభలేఖ మరియు గడియారాన్ని అందజేసారు. అలాగే ఊట్లపల్లి గ్రామ పంచాయతీలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి ఆలయంలో పూజలు చేసి ఆలయంలో ఒక గడియారాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల రైతు కన్వీనర్ జూపల్లి రమేష్, ఎంపిటిసి లు, సర్పంచ్ లు, నారాయణపురం రైతు సమితి సభ్యులు చిన్నంశెట్టీ నరసింహం, జూపల్లి ప్రమోద్, బిర్రం వేంకటేశ్వర రావు, అల్లాడి రామారావు, నండ్రు రమేష్, నాగు, జోషి, రామ లక్ష్మయ్య, అయా గ్రామ పంచాయతీ పెద్దలు, కార్యకర్తలు అభిమానుల తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: