గుండాల జూలై 28(మన్యం మనుగడ) రైతులు తమ మేకలు, గొర్రెలకు తప్పకుండా బ్లూ తంగ్ టీకాలను తప్పకుండా వేయించాలని వెటర్నరీ అసిస్టెంట్ హరి కిరణ్ సూచించారు. గురువారం మండలం పరిధిలోని జగ్గయ్య గూడెం గ్రామంలో 250 పైచిలుకు మేకలకు, గొర్రెలకు టీకాలు వేశామని హరి కిరణ్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీజన్లో వచ్చే వ్యాధుల నుండి మూగజీవాలను రక్షించుకోవాలంటే టీకా తోనే సాధ్యం అన్నారు, నీలి నాలుక వ్యాధి అనేది ప్రమాదకరమైనదని త్వరగా గుర్తించి టీకా వేయడం మూగజీవాలను ద్వారా వాటిని రక్షించవచ్చని అన్నారు, ఈ వ్యాధిన బరిన మూగజీవాలకు నాలుక ఎర్రబడి పొక్కులుగా మారుతుందని కంటి నుండి నీరు కారుతుందన్నారు. రైతులందరూ తమ మూగజీవాలకు టీకా వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: