గుండాల/ఆళ్లపల్లి జూలై 22(మన్యం మనుగడ) మండలంలోని ఆర్ఎంపి వైద్యులు తమ పరిధికి మించి వైద్యం చేయవద్దని ఎంపీపీ మంజు భార్గవి సూచించారు. శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల సింగారం గ్రామంలో మలేరియా జ్వరంతో మృతి చెందిన యువతి కుటుంబాన్ని పరామర్శించామని ఆమె అన్నారు. ఆమె దశదినకర్మ తన వంతు సహాయం అందిస్తానని ఆమె పేర్కొన్నారు. అదే గ్రామంలో జ్వరంతో బాధపడుతున్న మరో యువతికి కొత్తగూడెం వెళ్లడానికి 500 రూపాయల అందించడం జరిగిందన్నారు. ఆర్ఎంపీ వైద్యులు తమ పరిధికి దాటి వైద్యం చేయకూడదని ఆమె సూచించారు
Post A Comment: