గుండాల జూలై 22(మన్యం మనుగడ) విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పి డి ఎస్ యు నాయకులు రాజేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పరిషత్ పాఠశాల విద్యార్థుల స్థితిగతుల గురించి విద్యార్థుల నడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గదిలోని బందీలు కాకుండా బైటి ప్రపంచాన్ని సైతం అధ్యయనం చేయాలని వారికి సూచించారు. దేశంలో నిరక్షరాస్యత శాతాన్ని తగ్గించాలంటే ప్రభుత్వాలు ఎంతో కృషి చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాసారపు తరుణ్ పాల్గొన్నారు
Navigation
Post A Comment: