మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆదివారం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ బృందాన్ని శాలువా తో సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ.
గత 15రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి వరుద ఉదృతి మూలాన ప్రజల ఇండ్లు ముంపుకు గురికగా బాధిత కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో ఉన్న పరిస్థితి లో మంచి మనస్సు తో ముందుకు వచ్చి ఏటూరు నాగారం,మంగ పేట మండలాల కు చెందిన 2500 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 15కేజీ ల బియ్యం,పప్పులు,నూనె,
దుప్పట్లు,ఇతర సరుకులు అందించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారికి శ్రీ సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలని,ములుగు ప్రాంతానికి పేద ప్రజలకు సాయం చేయడం కోసం ముందుకు రావాలనీ కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు షణ్ముఖ రావు,లక్ష్మన్ రావు,లక్ష్మాయ్య,కిష్టయ్య, భాషా,సుబ్రమణ్యం,హన్మంతు,రామకృష్ణ,రాంబాబు,శివ,నారాయణ,అన్వేష్,దినేష్,రమేష్
సునీల్,జనార్ధన్,గంగాధర్,
తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: