జూలూరుపాడు జూలై 24, (మన్యం మనుగడ) ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలను ఆదివారం టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ ఆదేశానుసారం మండల పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సాయిబాబా ఆలయంలో కేటీఆర్ పేరున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్తు కేటీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోనీ, జడ్పిటిసి భూక్య కళావతి, మండల రైతు సమితి కోఆర్డినేటర్ యదళ్ళపల్లి వీరభద్రం, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు లాకావత్ గిరిబాబు, రామిశెట్టి రాంబాబు, రోకటి సురేష్, వేల్పుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: