గుండాల/ఆళ్లపల్లి జూలై 24(మన్యం మనుగడ) ఆళ్లపల్లి, మర్కోడు గ్రామాల మధ్యలో అలుగు వర్రె ప్రవాహం దాటికి రోడ్డు తెగిపోయింది. రోడ్డు మరమ్మతు పనులను ఇల్లందు డిఎస్పి రమణమూర్తి ఆదివారం పరిశీలించారు. మళ్లీ వర్షాలు వచ్చిన ప్రజలకు అసౌకర్యం కలగకుండా పనులను చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. మరమ్మతులు మళ్లీ చేయవలసి వస్తే స్థానిక పోలీస్ సిబ్బంది స్పందించి పనులు జరిగే విధంగా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై సంతోష్ , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: