మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో ముస్లిం మైనారిటీ మరియు వికెడివిఎస్ రాజు జూనియర్ కళాశాలలో మరి కొన్ని కళాశాలలో ఇంటర్ మరియు టెన్త్ పరీక్ష ఫలితాలు ఆశ జనకం తో రావడం తో అశ్వారావుపేట మండల దిశ అధ్యక్షురాలు ఎండీ రహీన బేగం, నియోజకవర్గ అధ్యక్షురాలు వగ్గెల పూజ, దిశ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి కళాశాలను సందర్శించి ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి వారికీ పుస్పగుచ్ఛాలను అందజేశారు. వికెడివిఎస్ కళాశాల ప్రినిపాల్ శేషుబాబు మరియు ముస్లిం మైనారిటీ విద్యాలయం ప్రధాన ఉపాధ్యాయురాలు సంగీత టీచర్ ను సత్కరించారు. ఈ కార్యక్రమం ని ఉద్దేశించి వేముల భారతి మాట్లాడుతూ గురుకుల మరియు మైనార్టీ పిల్లలకు మరింత చేయుత అందించాలి అని విద్యార్థులు నూటికి నూరి శాతం ఆధిక్యతను పొందటం సంతోష కరమని ఉపాధ్యాయుల క్రమశిక్షణ వలనే ఉత్తమ ఫలితాలు సాధ్యం అని అన్నారు. బాల బాలికలకు మహిళలకు రక్షణకు ఎలాంటి సమయంలో అయినా దిశ అండగా ఉంటుంది తెలియాజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి, నియోజకవర్గం అధ్యక్షురాలు వగ్గెల పూజ, మండల అధ్యక్షురాలు రహీన బేగం, అశ్వారావుపేట కోశాధికారి మామిడి వెంకటమహాలక్ష్మి పాల్గొన్నారు.
Post A Comment: