- అర్ఐ కి వినతిపత్రం అందజేసిన ఎంపిపి,మండల అద్యక్షులు
మన్యం మనుగడ కరకగూడెం: కేంద్ర ప్రభుత్వం పాల ఉత్పత్తులు,నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంచడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్,ఎంపిపి రేగా.కాళికా ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ కార్యలయం నుండి తహశీల్దారు కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేసి అనంతరం అర్ఐ కి వినతిపత్రం అందజేసినారు.
ఈ సందర్భంగా ఎంపిపి రేగా.కాళికా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు అయిన గ్యాస్,పెట్రోలు,డీజిల్ అదే విధంగా ప్రజలు కోనుగోలు చేసే నిత్యావసర వస్తువులు,పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ,కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన జీఎస్టీను వెంటనే ఎత్తి వేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు కొంపల్లి పెద్ద రామలింగం,అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి, పోగు వెంకటేశ్వర్లు,జాడి రామనాథం,యాలిపెద్ది శ్రీనువాసు రెడ్డి,రేగా సత్యనారాయణ,బైరిశెట్టి చిరంజీవి,యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,మహిళ సంఘం మండల అధ్యక్షులు కాసు లావణ్య,సర్పంచులు కొమరం విశ్వనాథం,పోలెబోయిన పాపమ్మ,యాకుబ్,బాలయ్య,సరస్వతి,రమాదేవి,కృష్ణారావు,సాంబయ్య,వెంకటేశ్వర్లు,వినోద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: