మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని గోదావరి ముంపుకు గురై లక్ష్మీ నగరం పునరావాస కేంద్రంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వైద్య సిబ్బంది శ్రద్ధ వహించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. పునరవస కేంద్రంలో ఉన్న బాలింతలకు గర్భిణీ స్త్రీలకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పాలు బ్రెడ్డు పండ్లు అందించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సమితి సభ్యులు నోముల రామ్ రెడ్డి మాట్లాడుతూ పునరావాస కేంద్రంలో గ్రామాలలో ఏర్పాటుచేసిన వైద్య సిబ్బందితో మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు అందుబాటులో ఉంటూ మందులు, అంబులెన్స్ వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని వరదల వల్ల నష్టపోయిన గర్భిణీ బాలింతల ఇళ్ళకు గవర్నమెంట్ ఇస్తున్న నష్టపరిహారం తో పాటు అదనంగా పదివేల రూపాయలు ఇవ్వాలని పునరావాస కేంద్రంలో ఉన్న బాలింతలో గర్భిణీలకు ప్రత్యేక రూములు ఏర్పాటు చేసి వారికి మంచి భోజనం పౌష్టికాహారం అందించాలని వైద్య సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి తాటిపూడి రమేష్, ఏఐవైఎఫ్ నాయకులు తాడిపూడి క్రాంతి కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: