జూలూరుపాడు జులై 6, (మన్యం మనుగడ) ప్రతినిధి, మండల పరిధిలోని పడమట నర్సాపురం ఎస్ వి కే యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "మన ఊరు మన బడి" కార్యక్రమంలో భాగంగా మంజూరీ అయిన పనులను బుధవారం వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ భూమి పూజ చేసి ప్రారంభించారు. "మన ఊరు మన బడి" పథకం క్రింద డైనింగ్ హాల్ నిర్మాణానికి 17 లక్షలు, డ్రింకింగ్ వాటర్ కి 94 వేలు, ఎలక్ట్రిసిటీ కి 2 లక్షల 71 వేలు, మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ కి 7 లక్షల 79 వేలు, నూతన తరగతి గది నిర్మాణానికి 13 లక్షల 76 వేలు మొత్తం 37 లక్షల రూపాయలు మంజూరి అయినట్లు తెలిపారు. వీటితోపాటు ఎన్ఆర్ఈజీఎస్ క్రింద ప్రహరీ గోడ నిర్మాణానికి 13 లక్షల 40 వేలు, టాయిలెట్స్ బ్లాక్ నిర్మాణానికి ఏడు లక్షలు మొత్తం 20 లక్షల 40 వేలు మొత్తం 57 లక్షల 40 వేల రూపాయలు మంజూరి అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్రం మోహన్ రావు, స్కూల్ చైర్మన్ గాంగులు, ఎంపీడీవో రవి, తహశీల్దార్ లూధర్ విల్సన్, ఎంఈఓ వెంకట్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గాప్రసాద్, యదళ్ళపల్లి వీరభద్రం, చౌడం నరసింహారావు, కాజా రమేష్, రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, మల్లెల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: