మన్యం మనుగడ,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాత రెడ్డిపాలెం పంచాయతీలోని చింతల బయ్యారం గోదావరి నదిలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చింది. స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ ఎస్ ఐ టి వి ఆర్ సూరి తెలిపిన వివరాల ప్రకారం వారం రోజుల క్రితమే వ్యక్తి మరణించి ఉంటాడని, ముఖం గుర్తుపట్టడానికి వీలు లేనట్టుగా ఉందని, పోస్టుమార్టం ప్రక్రియను గోదావరి పరివాహక ప్రాంతంలో చేయడానికి మాత్రమే అవకాశం ఉందని, అయన తెలియజేశారు. పోస్టుమార్టం అనంతరం వివరాలను తెలియజేస్తామని ఆయన తెలిపారు.
Post A Comment: