CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నదానం.

Share it:



  • ➖150 మందికి అన్నదానం.
  • ➖చింతకాని ఎమ్మార్వో మంగిలాల్ చేతుల మీదుగా పంపిణీ.


అశ్వాపురం-బట్టీలగుంపు:-------


*గోదావరి వరదల కారణంగా ముంపుకు గురైన అశ్వాపురం మండలంలోని బట్టీలగుంపు గ్రామ ప్రజలకు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 150 మందికి బుధవారం అన్నదాన కార్యక్రమం చేపట్టారు...ఈ అన్నదాన కార్యక్రమం చింతకాని మండలం తహశీల్దార్ శ్రీ మంగిలాల్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు..ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ...వర్షాకాలం ప్రారంభం కావడంతో గోదావరి పెరిగి ఉగ్రరూపం దాల్చడంతో అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి, పాములపల్లి, బట్టీలగుంపు, రామ్ నగర్,మంగలచెలక,చింతిర్యాల గ్రామాల్లో ఇండ్లు వరద ముంపుకు గురికావడంతో ప్రజలు ఇండ్లు ఖాళీ చేసి బిక్కుబిక్కుమంటూ పునరావాస కేంద్రాల్లో ఉండాల్సి వచ్చిందని..వరద నీరు చేరడంతో ఇండ్లన్నీ మురికి కుపాలుగా మారాయని-బురదమయంగా మారడంతో కనీసం అన్నం వండుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న మీకు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహుకులు-శివకామేశ్వరి గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చే శ్వరరావు మీకు అన్నదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారని మంగిలాల్ గారు కొనియాడారు...దాతలు ముందుకొచ్చి వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్,బచ్చు స్వరాజ్య రావు,టీవీఎల్ నర్సయ్య,సజ్జా సాహితీ,రాయల కోటమ్మ, సెక్రటరీ వనజ,కిరణ్మయి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు*

Share it:

TS

Post A Comment: