దమ్మపేట జూలై 07 ( మన్యం మనుగడ ) :అశ్వరావుపేట దమ్మపేట లో. మేజిస్ట్రేట్ కోర్టు .ఆర్ టి.వో కార్యాలయం. డీఎస్పీ కార్యాలయం. సబ్ రిజిస్టర్ కార్యాలయం. ఆర్టీసీ డిపో. ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీ మరియు బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో దమ్మపేట .తాసిల్దార్ స్వామి కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది . ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు బార్ కౌన్సిల్ సభ్యులు గొంది మురళి మోహన్ రావు మాట్లాడుతూ గతంలో సత్తుపల్లిలో కోర్టు ,ఆర్ టి వో. డిఎస్పీ కార్యాలయం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆర్టీసీ డిపో ఉండేదని జిల్లా విభజనలో భాగంగా కొత్తగూడెం జిల్లా సెంటర్కు మారడం వలన దమ్మపేట అశ్వరావుపేటకు వంద కిలోమీటర్ల పైనే ఉన్నదని సరైన బస్సు సౌకర్యం లేదని ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారని తక్షణం ఈ కార్యాలయాన్ని అశ్వరావుపేట లేక దమ్మపేటలో ఏర్పాటు చేయాలని లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయాలను స్థాపించే వరకు నిరంతర రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలిపినారు ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి శంకు పాక ధర్మ మహిళా సమాఖ్య కార్యదర్శి జానీ బేగం .శాంతి రైతు సంఘం నాయకురాలు గాజుబోయిన కృష్ణవేణి దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షురాలు నక్క నాగమణి మైనార్టీ సమైక్య నాయకురాలు జాన్ బి బార్ కౌన్సిల్ సభ్యులు మారేశ్ నాగేశ్వరావు శ్రీను.తదితరులు పాల్గొన్నారు
Post A Comment: