మన్యం టీవీ దుమ్ముగూడెం:
దుమ్ముగూడెం మండలంలోని పీరాయిగూడెం గ్రామ సమీపంలో ఉన్నటువంటి గుబ్బల మంగి వాగు చేపల వేటకు వెళ్లి వరదలో కొట్టుకుపోయారు వివరాలు ఇలా ఉన్నాయి ఎర్రగడ్డ గ్రామానికి చెందిన ఎనిక దుర్గమ్మ, కొమరం సారమ్మ, వినోద్ కుమార్ వీరందరూ కలిసి చేపల వేటకు నడిగడ్డ గ్రామసమీపంలో ఉన్న గుబ్బల మంగి వాగు కు వెళ్లారు వారు వెళ్లిన సమయంలో వరద ఉధృతి సాధారణ స్థితిలో ఉంది అయితే వారు వాగు మధ్యలో రాళ్లదిబ్బ మీద ఉండి చేపల వేట కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో ఒకసారి గా వరద ఉధృతి పెరిగింది ఇది గమనించిన చేపలు పట్టడానికి వచ్చిన చుట్టుపక్కన ఉన్నవాళ్లు వరద ఉధృతి పెరుగుతుందని కేకలు వేశారు అలానే వారితో పాటు చేపల వేటకువచ్చిన చిన్న బండి రేవు గ్రామానికి చెందిన వ్యక్తి వారికి ధైర్యం చెబుతూ వాగు మధ్యలో ఒక పొదల్ని పట్టుకొని ఉన్నారు ఈ క్రమంలో గ్రామానికి చెందిన మహేష్ సమ్మయ్య తదితరులు ఒక త్రాడు సాయంతో వారిని రక్షించారు అయితే వరద ఉధృతి ఎక్కువ కావడంతో తాడు అందలేకపోయినా ఎనిక దుర్గమ్మ వరదలో కొట్టుకుపోయింది స్థానికులు తెలిపారు.
Post A Comment: