మన్యం టీవీ దుమ్ముగూడెం :: వరద ప్రభావిత ప్రాంతాల్లో మండల టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం, తురుబాక బండారుగుడెం వైట్నాగారం రేగుబల్లి , కె.దుమ్ముగూడెం ,వర్కుషాప్ దుమ్ముగూడెం, సున్నంబట్టి, తదితర వరదప్రభావిత గ్రామాలలో పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ డా. తెల్లం.వెంకట్రావు ఆధ్వర్యంలో పర్యటించారు. ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని తక్షణసాయంగా 10,000/- ప్రకటించిందని లోతట్టు గ్రామాలకు రక్షణ చర్యల తీసుకుంటుందని ఆకాలవరద లకు చేలా నష్టం చేకూరింది ఇటువంటి విపత్తులను మండల ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారని అన్నారు. కె.రేగుబల్లి పునరావసకేంద్రం సందర్శించి అక్కడి సదుపాయాలు ఎట్లా ఉన్నాయి అని బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు . ఆరోగ్యసమస్యలపై శ్రద్దవహించాలని విషజ్వరాలు ప్రబలకుండా పునరవసకేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు ముంపుగ్రామలలో బ్లీచింగ్ చల్లి శుద్ధిచేయలని సర్పంచులు తెలిపారు. ఈకార్యక్రంలో పార్టీ మండల అధ్యక్ష కార్యదర్సులు అన్నే సత్యనారాయణమూర్తి, కణితి రాముడు ఎంపీపీ రేసు లక్ష్మి,జడ్పిటిసి తెల్లం సీతమ్మ, సొసైటీ డైరెక్టర్లు బొల్లి వెంకట్రావు, సర్పంచులు వరస శివరామకృష్ణ, బుక్యా చందు, కటేబోయిన వెంకటేశ్వర్లు, సోడి కొండయ్య,పూజారి మోహనరావు, తెల్లం రామకృష్ణ,జుంజురి లక్ష్మి, ఎంపీటీసీలు సోడి తిరుపతిరావు, మడకం.రామారావు, నాయకులు దామెర్ల.శ్రీనివాసరావు, మోతుకురి శ్రీకాంత్, జుంజురి జయసింహ, కెల్లా శేఖర్ తధిరులు పాల్గొన్నారు.
Post A Comment: