CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీతానగరం వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన బీఎస్పీ నాయకులు..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం : మండలంలోని సీతానగరం గ్రామంలో గోదావరి వరదల సమయంలో ముంపుకు గురైన బాదిత కుటుంబాలను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట అధ్యక్షులు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు బీఎస్పీ దుమ్ముగూడెం మండల కన్వీనర్ సరియం భీమ్ ఆద్వర్యంలో నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కార్యదర్శి తడికల శివకుమార్ ముంపు ప్రాంతంలో పర్యటించి బాదితులను పరామర్శించి నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద సాయంగా ప్రభుత్వం ప్రకటించిన 10,000/- రూపాయలు సాయం కూడా సరిపోదని, తక్షణమే సర్వే జరిపించి జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసి కుటుంబానికి లక్ష మేర ఆర్దిక సాయమందించి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి సోడి వీరస్వామి, దుమ్ముగూడెం మండల కో కన్వీనర్‌ కంచెర్ల సింహాద్రి, మండల ప్రధాన కార్యదర్శి పొడుతూరి రవీంద్ర ప్రసాద్, మండల కార్యదర్శి కొప్పుల నారాయణ, సీతానగరం సెక్టార్ అధ్యక్షులు ధనగం వంశీ తదితర బిఎస్పి నాయకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: