మన్యం టీవీ దుమ్ముగూడెం :
గోదావరి వరదలతో తీవ్ర నష్టం చేకూర్చిన దుమ్ముగూడెం మండలంలోని పలు గ్రామాలను గోదావరి వరద స్పెషల్ అధికారి కమిషనర్లు హనుమంతరావు, రజత్ కుమార్ సైని వరద ప్రాంతాలను సందర్శించారు. వర్క్ షాప్, పర్ణశాల గ్రామాల్లో పర్యటించి వరద బాధితులు అన్ని విధాలు ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. మండలంలోని వరద ముప్పు గ్రామాల్లో బ్లీచింగ్ చెల్లించి సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్ణశాల గ్రామంలో సర్పంచ్ వరలక్ష్మి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పర్ణశాల పుణ్యక్షేత్రాన్ని త్వర త్వరగా పరిశుద్ధ పనులు చేపట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, తాసిల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో చంద్రమౌళి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: