మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో గోదావరి వరదల కారణంగా ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దయానంద స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాట్లాడుతూ ఎటువంటి అనారోగ్యం బారిన పడిన బాధితులు అందరికీ ప్రథమ చికిత్స అందించడం చేయాలని తెలియజేయడం జరిగింది. అన్ని రకాల మందులు సిద్ధంగా ఉంచాలని సిబ్బందికి సూచించడం జరిగింది. ఈ కార్య క్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు శివ కుమార్, హెచ్ ఇ ఓ వీరస్వామి, పి హెచ్ ఎన్ సుగునా దేవి, ఏఎన్ఎం సుశీల , ఆశాలు జ్యోతి, రజిత ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: