మన్యం మనుగడ, మంగపేట.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు,నదులు పొంగి అనేక గ్రామాలు నీట మునిగిన సందర్బంగా ప్రభుత్వం ప్రకటించిన విపత్తు సహాయం తరపున మండలం లోని కత్తిగూడెం, దేవనగరం లోని 47 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి సన్న బియ్యం 25 కేజీలు, 5 కేజీల కంది పప్పు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్,రెవిన్యూ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, వెంకటనర్సమ్మ, పాగ బాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: