మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలో రామన్నగూడెం, రామ నగర్ గ్రామాల గోదావరి వరద ముప్పు బాధిత కుటుంబాలకు సేవా భారతి వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో నిత్య అవసర సరుకులు అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏటూరు నాగారం సిఐ కిరణ్ కుమార్ పాల్గొని బాధిత కుటుంబాలకు అందజేశారు.రామన్నగూడెం గ్రామంలో 199 కుటుంబాలకు, రాంనగర్ గ్రామంలో 10 కుటుంబాలకు నిత్యవసర సరుకులతో పాటు మెడికల్ క్యాంపు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏటూరు నాగారం సట్ల కిరణ్ కుమార్ మాట్లాడుతూ. సేవా భారతి,వనవాసి కళ్యాణ పరిషత్ సయుప్తంగా నిర్వహిస్తున్న గోదావరి ముప్పు ప్రాంతాలలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాల్లో యువత పాల్గొనాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పలపల్లి రమేష్,రాజు,శ్రీనివాస్, కుదురుపాక ప్రవీణ్ కుమార్, సాయి బాబా,పోషలు,శ్రీను, మనోహర్,యాదగిరి,చందు, వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: