గుండాల/ఆళ్లపల్లి జూలై (మన్యం మనుగడ) ఏజెన్సీ గ్రామాల్లో గ్రామీణ వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆళ్లపల్లి గ్రామీణ వైద్యుల సంఘం మండల అధ్యక్షులు నయీమ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను ఆయన ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడుతూ. ఏజెన్సీలో గ్రామీణ వైద్యులు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. నిత్యం రాత్రనక పగలనక ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలను అందిస్తున్నామని ఆయన అన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే గ్రామీణ వైద్యులను ప్రభుత్వం గుర్తించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తెలగాని శ్రీను, ఆఫీస్, ఆర్ఎంపి వైద్యుడు ఖలీద్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: