మన్యం మనుగడ, అశ్వారావుపేట:మండలం లోని ముస్లిం సహోదరులు అందరూ కలిసి జమాతే ఉలేమా ఆధ్వర్యంలో గోదావరి వరద ముంపు బాధితులకు బాసటగా నిలిచారు. ముస్లిం కమిటి సదర్ ఎండి అసిఫ్ అలీ, హఫీజ్ జాకీర్ పర్యవేక్షణలో కుక్కునూరు, వేలేరుపాడు మండలం లోని ముంపు బాధితులకు కూరగాయలు, మంచినీటి బాటిళ్లు, నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. రెండు వందల కుటంబాలకు కూరగాయలు, 600 కుటంబాలకు మంచినీటి బాటిళ్లు, 250 కుటంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమంలో నజీర్, అరిఫ్, సాజిద్, వినాయకపురం సహోదరులు ఇమ్రాన్ షరీఫ్, హసన్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: