మన్యం టీవీ మణుగూరు:
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, రేగా కాంతారావు తెలిపారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి ద్వారా మన గ్రామాలను పట్టణాలను చాలావరకు శుభ్రం చేసుకోవడం జరిగింది అన్నారు.పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి అమలు చేయడం వలన దోమల ద్వారా వ్యాప్తి చెందే టైఫాయిడ్ మలేరియా మొదలైన రోగాలు తగ్గుతున్నాయి అన్నారు. ప్రజలు అందరూ తమ పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలన్నారు.ఇంటి పరిసర ప్రాంతాలలో మురుగునీరు నిలువ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నీరు నిల్వ ఉండటం వల్ల దోమల వృద్ధి ఎక్కువగా ఉంటుందని, తద్వారా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని అన్నారు.తప్పనిసరిగా ప్రజలందరూ నీటిని వేడి చేసుకుని చల్లారిన తరువాత తాగాలన్నారు.సీజన్ లో ప్రజలు వర్షం నీటిలో తడవకుండా జాగ్రత్త వహించాలి అని,ఏమైనా అనారోగ్య లక్షణాలు కనబడితే వైద్యుల సలహాలు,సూచనలు పాటించాలన్నారు.వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో రైతులు,కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Post A Comment: