జూలూరుపాడు జులై 4, (మన్యం మనుగడ) ప్రతినిధి, హుజూర్నగర్ లో ఈ నెల 1, 2, 3వ తేదీ లలో జరిగిన రెండవ రాష్ట్ర మహా సభ లో జూలూరుపాడు కు చెందిన చండ్ర నరేంద్ర కుమార్ ను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగాఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యదర్శి చండ్ర నరేంద్ర కుమార్ సోమవారం మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో రాష్ట్ర నాయకత్వం నాకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. పురుగు మందులు, పంటల కొనుగోలు పై రైతుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమాలు నిర్వహిస్తానని, తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Post A Comment: