మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు సిఎస్ఆర్ నిధులు రూ.2 కోట్ల రూపాయలతో నిర్మించిన సెంట్రల్ లైటింగ్,డివైడర్ లను ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా.కాంతారావు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ, మణుగూరు అంబేద్కర్ సెంటర్ నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.వివిధ ప్రభుత్వ కార్యాలయాలను కలుపుతూ సాగిన ఈ సెంట్రల్ లైటింగ్ డివైడర్ ఈ ప్రాంత ప్రజలకి ప్రత్యేక గుర్తింపునిచ్చేది గా నిలిచిపోతుందని ఆయన తెలిపారు.సింగరేణి యాజమాన్యం సిఎస్ఆర్ నిధుల నుండి రూ 2 కోట్ల రూపాయలను,అందించినందుకు గాను వారికి అభినందనలు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి పట్టణాల సుందరీకరణ పై అపురూపమైన కార్యాచరణ చేస్తుందని,అందులో భాగమే ఇటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన తెలిపారు.కేటీఆర్ నాయకత్వం లోని మున్సిపాలిటీ,పట్టణాల అభివృద్ధి విషయంలో అడుగడుగునా వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం. విజయకుమారి,జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,స్థానిక ఎంపీటీసీలు,సర్పంచ్,బచ్చల.భారతి,ఎంపిఓ వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మణుగూరు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,కార్యదర్శులు,పార్టీ ముఖ్య నాయకులు, యువజన నాయకులు, టిఆరేస్వి నాయకులు,మహిళ కార్యకర్తలు,సోషల్ మీడియా సభ్యులు,స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: