CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కరెంట్ షాక్ తో పోస్ట్ ఉమెన్ మృతి.

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం:

దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామంలో గ్రామానికి చెందిన పోస్ట్ ఉమెన్ మద్ది ఆదిలక్ష్మి (36),కరెంట్ షాక్ తో మృతి చెందింది. సంఘటన వివరాలు వారు నీటి కోసం గోదావరి ఒడ్డున మోటార్ పెట్టి కరెంటు కనెక్షన్ ఇంట్లో పెట్టుకుని స్విచ్ ఆన్ చేసి నీటిని ఉపయోగిస్తుంటారు. అలానే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మోటర్ పెట్టిన నీళ్లు రాకపోవడంతో గోదావరి ఒడ్డున ఉన్నటువంటి మోటర్ దగ్గరకు కొడుకు రాహుల్ తో వెళ్లి పరిశీలిస్తు మోటార్ను పైకి లాగి పైపులు సరి చేశారు. అనంతరం కొడుకుని వెళ్లి మోటర్ ఆన్ చేసి నీళ్లు పట్టమని చెప్పింది తను వెళ్లి మోటార్ ఆన్ చేసి నీళ్లు పట్టిన తల్లి రాకపోవడంతో మళ్లీ గోదావరి దగ్గర ఉన్నటువంటి మోటర్ దగ్గరకు వెళ్ళాడు. అయితే ఆదిలక్ష్మి ఇంటికి వచ్చే క్రమంలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గోదావరి ఒడ్డు బురదమయం కావడంతో కాలుజారి మోటారు మీద పడి కరెంట్ షాక్ తగిలింది. గమనించిన రాహుల్ స్థానికులు సహాయంతో ములకపాడు హాస్పిటల్ కి తరలించి పరీక్షించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.మృతురాలి భర్త ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేశవరావు కేసు నమోదు చేసి సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

Share it:

TS

Post A Comment: