గుండాల/ఆళ్లపల్లి జూలై 27(మన్యం మనుగడ) మండలం పరిధిలోని రాఘవాపురం గ్రామ సమీపంలోని అలుగు వర్రే ప్రవాహం దాటికి ఆళ్లపల్లి మర్కోడు మార్గమధ్యలోని రహదారి తెగితే నాలుగు రోజులు గడిచిన ఆర్ అండ్ బి అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలకు నానా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిత్యవసర వస్తువులతో పాటు అత్యవసరమైన వైద్య సదుపాయాలు కూడా ఆ గ్రామాలకు అందటం లేదు. సుమారుగా 15 గ్రామాలకు పైగా పూర్తిగా రాకపోకలు స్తంభించడంతో జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు
Navigation
Post A Comment: