గుండాల జూలై 27(మన్యం మనుగడ) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం భద్రాచలం, పినపాక నియోజకవర్గ ముంపు మండలాలను మూడు రోజులపాటు పర్యటించనున్నారని ఆ పర్యటనలో గుండాల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనబోతున్నామని టిడిపి మండల అధ్యక్షులు సాంబయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముంపు బాధితులను పరామర్శించి భరోసా కల్పించేందుకు చంద్రబాబు పర్యటన ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎస్.కె సంధాని, నాయకులు ఇల్లందుల అప్పారావు, ఇల్లందుల నరసింహులు, మధు, పుల్లయ్య లు పాల్గొన్నారు
Post A Comment: